ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన పెప్పర్‌ మోషన్‌ సీఈవో ఆండ్రియాస్‌ హేగర్ ప్రతినిధి బృందం

అమరావతి : సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను జర్మనీకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్ధ పెప్పర్‌ మోషన్‌ సీఈవో ఆండ్రియాస్‌ హేగర్ ప్రతినిధి బృందం కలిసింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో రూ. 4,640 కోట్లతో 800 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్‌ బస్సు, ట్రక్‌ క్లస్టర్‌ యూనిట్‌ను ఏర్పాటుచేయనున్న పెప్పర్‌ మోషన్, అతి త్వరలో భూమిపూజకు కంపెనీ సిద్దమవుతోంది. గ్రీన్‌ ఎనర్జీకి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామిక విధానాలు, సింగిల్‌ విండో అనుమతులు, పారదర్శక విధానాలపై పెప్పర్‌ మోషన్‌ ప్రతినిధులతో చర్చించిన సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చర్చించారు. ఏడాదికి 30,000 ఎలక్ట్రిక్‌ బస్సులు, ట్రక్కులు తయారీ సామర్ధ్యం, ఇంటిగ్రేటెడ్‌ వర్టికల్‌ ప్రొడక్షన్‌ ఫెసిలిటీ ఏర్పాటుచేయనున్న పెప్పర్‌ మోషన్, 20 జీడబ్ల్యూహెచ్‌ సామర్ధ్యం గల బ్యాటరీల నుంచి ఎలక్ట్రిక్‌ బస్సులు, ట్రక్కుల తయారీ, అంతర్జాతీయ ప్రమాణాలతో యూనిట్‌ ఏర్పాటు, డీజిల్‌ బస్సులు, ట్రక్కులను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చే రిట్రో ఫిట్టింగ్, 20 జీడబ్ల్యూహెచ్‌ సామర్ధ్యం ఉండే బ్యాటరీ తయారీ యూనిట్‌ ఏర్పాటుచేయనున్నట్లు సీఎంకి పెప్పర్‌ మోషన్‌ సీఈవో తెలిపారు. జర్మనీ ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన పెప్పర్‌ మోషన్‌ యూరప్, యూఎస్‌ఏ, మెక్సికో, చైనాలో విస్తరణ, లీడింగ్‌ గ్లోబల్‌ కార్పొరేషన్స్‌తో పార్ట్‌నర్‌షిప్‌ ఉంది. ఏపీలో ఏర్పాటుచేస్తున్న యూనిట్‌కు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడం, ప్రభుత్వ సహకారంపై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన పెప్పర్‌ మోషన్‌ సీఈవో, ఏపీలో ఏర్పాటుచేస్తున్న గ్లోబల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ద్వారా ఏషియా, మిడిల్‌ ఈస్ట్, ఆఫ్రికా వంటి దేశాల్లోని పెప్పర్‌ భాగస్వామ్యులకు కూడా ఇక్కడి నుంచే సేవలు అందుతున్నాయి. 8,100 మంది ఇంజినీర్లు, టెక్నీషియన్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సమావేశంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, డాక్టర్‌ మథియాస్‌ కెర్లర్‌ (పెప్పర్‌ మోషన్‌ సీటీవో), ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ఉవే స్టెల్టర్, ఉర్త్‌ ఎలక్ట్రానిక్‌ ఇండియా ఎండీ హర్ష ఆద్య, పెప్పర్‌ మోషన్‌ సీఐవో రాజశేఖర్‌ రెడ్డి నల్లపరెడ్డి, సీఎస్‌వో సత్య బులుసు, సీసీవో రవిశంకర్, అసోసియేట్‌ శ్రీధర్‌ కిలారు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

సీఎంతో సమావేశం అనంతరం పెప్పర్‌ మోషన్‌ సీఈవో ఆండ్రియాస్‌ హేగర్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో వరల్డ్‌ క్లాస్‌ యూనిట్‌ ఏర్పాటుచేయడంపై చాలా సంతోషంగా ఉన్నాం. అత్యంత అధునాతన టెక్నాలజీతో మా యూనిట్‌ ఏర్పాటుచేయబోతున్నాం, ప్రజా రవాణాకు అవసరమైన విధంగా డీకార్బొనైజ్డ్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ తీసుకువచ్చేలా మా యూనిట్‌ నుంచి వాహనాల ఉత్పత్తి జరుగుతుంది. మేం ఏపీలో యూనిట్‌ ఏర్పాటు చేయడం సరైన నిర్ణయంగా భావిస్తున్నాం. బెంగళూరు, చెన్నై నగరాలకు దగ్గరగా మా యూనిట్‌ను ఏపీలో ఏర్పాటు చేస్తున్నాం, ఏపీ ప్రభుత్వం మాకు అందించిన సహాయ సహకారాలు మరువలేనివి, సీఎం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, సీఎం విజనరీ థింకింగ్, పాలసీలు మమ్మల్ని ఆకట్టుకున్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *