కాంగ్రెస్ తోనే రైతు సంక్షేమం

  • రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి శ్రీ చరణ్ రెడ్డి

ఖమ్మం రూరల్, (పాలేరు ఎక్స్ప్రెస్ న్యూస్) కాంగ్రెస్ ప్రభుత్వం తోనే రైతు సంక్షేమం సాధ్యమవుతుందని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి శ్రీ చరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు యాదవుల సంఘం ప్రెసిడెంట్ సోమనబోయిన లింగయ్య మిరప తోటలో శ్రీ చరణ్ రెడ్డి నాటు నాటు వేసి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పూటకో మాట చెబుతూ నట్టేట ముంచుతుందన్నారు. వడ్లు కొనుగోలులో తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆలస్యం వల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. రైతు సంక్షేమం రావాలంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం లోకి రావాలన్నారు. వరంగల్‌లో రాహుల్‌గాంధీ ఇచ్చిన రైతు డిక్లరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తిస్ధాయిలో అమలు చేస్తుందని తెలిపారు. రూ. రెండు లక్షల రుణమాఫీ, పక్కా ఇండ్ల నిర్మాణాలు, రైతులకు యంత్రాలు అందిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికలు సమీపిస్తుండగా మరోసారి మభ్యపెట్టి అడ్డదారిలో గెలవాలని చూస్తున్నారని, ప్రజలు మంచి చేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యరబోలు శ్రీను, బోడా వెంకన్న, దాసరి వెంకన్న, పాలేరు నియోజకవర్గ యువజన నాయకుడు భూక్య సురేష్ నాయక్, మీరా సాహెబ్ ,ఆoతోటి వెంకన్న , నునావత్ బిక్షం నాయక్, వినోద్ ,బెల్లంకొండ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *