ఖమ్మం రూరల్, పాలేరుఎక్స్ప్రెస్ న్యూస్ : ఖమ్మం రూరల్ మండల ఏదులాపురం చౌరస్తా వద్ద ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్తుపల్లి లోని, అయ్యగారి పేట గ్రామం, ఎన్టీఆర్ కాలనీకి చెందిన దాసరి వెంకన్న గత 25 సంవత్సరాలుగా అక్కడ గుడిసె వేసుకొని చీపుర్లు అమ్ముకుంటూ కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అతని కుమారుడు దాసరి రవి (16) ఆగస్టు 15న ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. చుట్టుపక్కల గ్రామాలు బంధువుల ఇండ్లు వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆగస్టు 18న పోలీసులకు ఫిర్యాదు అందించారు. ఇంటి నుంచి వెళ్లినప్పుడు ఎరుపు రంగు చొక్కా, బ్లాక్ రంగు నిక్కర్ ధరించాడని, కుడి చేయి వంకరగా ఉండడంతో పాటు మాటలు రావని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అంతేకాకుండా మనిషి కూడా సరిగ్గా ఉండడని మతిస్థిమితం లేకపోవడంతో పిచ్చిపిచ్చిగా ఉంటాడని తెలియజేశారు.ఆచూకీ తెలిసిన వారు 9618030916, 9618720470 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
Leave a Reply