మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి:

కొడకండ్ల: తెలంగాణరాష్ట్రంలో మార్పు కావాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని ఎన్ ఎస్ యు ఐ పాలకుర్తి నియోజకవర్గ అధ్యక్షుడు దేశ గాని హరగోపాల్ గౌడ్ గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు ఈవీఎంలో రెండో సంఖ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయని యువ నాయకురాలు అయిన యశస్విని రెడ్డికి యువకులు అన్ని వర్గాల వారు అండగా నిలిచి అసెంబ్లీకి పంపాలని, పాలకుర్తి నుండి మార్పుకు నాంది పలకాలని హరగోపాల్ గౌడ్ కోరారు . ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు బంధారపు చెందు , బొమ్మగాని గణేష్ ,నర్మిట ఆదర్శ్ గౌడ్, ఎరుకల వినయ్ తదితరులు పాల్గొన్నరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *