- ఖండించిన ఆ పార్టీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు
ఖమ్మం రూరల్, (పాలేరు ఎక్స్ప్రెస్ న్యూస్) ఖమ్మం రూరల్ మండలం గుదిమల్ల గ్రామానికి చెందిన బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు చెరుకుపల్లి నాగేశ్వరరావు, జిల్లా అఖిలభారత యాదవ్ మహాసభ యూత్ ప్రధాన కార్యదర్శి పొదిల సతీష్ యాదవ్ ను స్థానిక పోలీసులు బుధవారం ముందస్తు అరెస్టులు చేశారు. సూర్యాపేట జిల్లాకు చెందిన వట్టే జానయ్య యాదవ్ పై అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇచ్చిన పిలుపుమేరకు అక్కడ చేపట్టిన మహా ధర్నాకు హాజరుకాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిని చెరుకుపల్లి నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో ఖండించి మాట్లాడారు… అక్రమ అరెస్టులతో బహుజన ఉద్యమాన్ని ఆపలేరని, ఎన్ని నిర్బంధాలు విధించిన భయపడే ప్రసక్తే లేదన్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఓటమి భయంతోనే బీసీ నాయకులను అక్రమ అరెస్టులు చేపిస్తున్నాడని దుయ్యబట్టారు.
Leave a Reply