వైభవంగా ముత్యాలమ్మ, పోతురాజు విగ్రహాల ప్రతిష్టాపన

  • హాజరైన కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులు

ఖమ్మం రూరల్ పాలేరు, (ఎక్స్ప్రెస్ న్యూస్) ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం గ్రామపంచాయతీ లోని చిన్న తండా గ్రామంలో గల ఈదుల చెరువు కట్టపై ముత్యాలమ్మ తల్లి, పోతురాజు స్వామి విగ్రహాలను బుధవారం ప్రతిష్టించారు. ఉదయం 6-5 నిమిషాల నుంచి మంగళ వాయిద్యములతో 7-30కు మంత్రాభిషేకములు, 8-05 కు విజ్ఞేశ్వర పూజ, సర్వ దేవత, ముత్యాలమ్మ తల్లి హోమములు, 10 గంటలకు వాస్తు పూజ పరిగ్మీకరణ, బింబశుద్ధి ,10:30కు గర్తపూజలు రత్న న్యాసము, దాతు న్యాసము , 10:50కు జీవ పోయుట, 10 54 కు యంత్ర విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ట, కలన్యాసము దృష్టి స్థాపన సర్వదర్శనము, దృష్టిస్తాపన, సర్వదర్శనము, పూర్ణహుతి కార్యక్రమాలను నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ కో- కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, విఏ డెవలపర్స్ అధినేత గరికపాటి ఆంజనేయ ప్రసాద్ హాజరయ్యి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహమ్మద్ మౌలానా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, డెవలపర్స్ అధినేత గరికపాటి ఆంజనేయ ప్రసాద్, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఘనపరపు వీరన్న, ఉప్పు గండ్ల నవీన్ ను శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, చావా శివరామకృష్ణ, మండల అధ్యక్షుడు కళ్లెం వెంకట్ రెడ్డి, నాయకులు మద్దికిషోర్ రెడ్డి, సుదగాని ఉపేందర్, అజ్మీర అశోక్ నాయక్, భూక్య సురేష్ నాయక్, హరినాయక్, రమేష్, గోపి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *