సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

  • మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సిఫారసుతో మంజూరు

ఖమ్మం రూరల్ , (పాలేరు ఎక్స్ప్రెస్ న్యూస్) : ఖమ్మం రూరల్ మండలం ఏదలాపురం గ్రామానికి చెందిన 2 లబ్ధిదారులకు మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స నిమిత్తం బొడ్డు జయంతి, రామిశెట్టి మహేష్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ సహకారంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సిఫారసు ద్వారా దరఖాస్తు చేసుకోగా జయంతికి రూ. 50వేలు, మహేష్ కు రూ.30వేలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరయ్యాయి. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు చెరుకుపల్లి భాస్కర్ రావు, మండల సమితి సభ్యులు దండి రంగారావు, వెన్నం భాస్కరరావు, వరంగల్ క్రాస్ రోడ్ శాఖ కార్యదర్శి వెంపటి సురేందర్, యువజన సంఘం నాయకుడు గణపారపు ఉపేందర్, మేళ్లచెరువు సాయి, గ్రామ నాయకులు మేళ్లచెరువు రవి, లక్ష్మీనారాయణ, పాషా తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *