మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి

పెద్దవంగర:
మహిళలు ఆర్థికంగా నిలబెట్టుకోవాలని ఎర్రబెల్లి చారిటబుల్ చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న పెద్దవంగర మండలంలోని నాలుగు సెంటర్
లోని మూడవ బ్యాచ్ కు చెందిన 200 మంది మహిళాలకు శనివారం మండలం కేంద్రంలోని రైతు వేదికలో ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళాలకు చీరలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెనుకదాసుల లక్ష్మిరాంచంద్రయ్య శర్మ, ఎంపీపీ ఈదురు రాజేశ్వరి,జడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి, ఎంపీటీసీ సభ్యులు ఎదునూరి శ్రీనివాస్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఈదురు ఐలయ్య, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్, మండల నాయకులు శ్రీరామ్ సుదీర్, గ్రామ పార్టీ అధ్యక్షులు బోనగిరి లింగమూర్తి, సీసీలు సుధాకర్,ట్రైనర్లు కన్నె స్వప్న,అనూష,అనపురం రాణి, మహిళాలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *