స్థానికేతరుడైన ఎర్రబెల్లి ని ఓడించాలి

  • మాజీ టీపీసీసీ సభ్యుడు ముత్తినేని సోమేశ్వరరావు
    తొర్రూరు:

పాలకుర్తిని పరాయి వాళ్ళ పాలు చేయవద్దని.. సానికేతరుడైన ఎర్రబెల్లిని ఓడించాలని మాజీ టీపీసీసీ సభ్యుడు ముత్తినేని సోమేశ్వర రావు అన్నారు.

శనివారం డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సోమేశ్వరరావు మాట్లాడారు.

పాలకుర్తి నియోజకవర్గంతో సంబంధం లేని
మంత్రి దయాకర్ రావు ఇక్కడి ప్రజలను మభ్యపెట్టి గెలుస్తున్నాడని దుయ్యబట్టారు. సునాయాసంగా ఈ ఎన్నికల్లోనూ గెలుస్తానని ప్రగల్బాలు పలుకుతున్న దయాకర్ రావు ఎందుకు కాంగ్రెస్, ప్రతిపక్షాల నాయకులను కొనుగోలు చేస్తున్నాడని ప్రశ్నించారు. ఎర్రబెల్లికి ఓటమి భయం పట్టుకుందని అందుకే తండా బాటల పేరిట కాలికి గజ్జె కట్టుకొని తిరుగుతున్నాడన్నారు. ఎర్రబెల్లి ఎన్ని జిమ్మిక్కులు చేసినా గిరిజనులు కాంగ్రెస్ వైపే ఉంటారన్నారు.
తాము తలుచుకుంటే 30 మంది ముఖ్యమైన బీఆర్ఎస్ లీడర్లను కాంగ్రెస్ లో చేర్పించుకునే సత్తా ఉందన్నారు. నియోజకవర్గానికి ఏం చేశావో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చెన్నూరు రిజర్వాయర్ ను పూర్తి చేయలేదని, ఎక్కడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదని.. ప్రతి హామీ మోసపూరితమన్నారు.
ఎర్రబెల్లి ని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని… అందరూ కంకణ బద్ధులైతే బీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు.

సోనియా గాంధీ ఆశయం మేరకు తెలంగాణను దొరలు, దోపిడీదారుల నుంచి తప్పించి కాంగ్రెస్ కు పట్టం కట్టాలన్నారు.
తెలంగాణ కలను నెరవేర్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకు విజయభేరి సభను పార్టీ పెద్ద ఎత్తున నిర్వహిస్తుందని, ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో
నాయకులు కోటగిరి సుదర్శన్, గూడెల్లి వెంకన్న, దేవేందర్ రాజు, పబ్బాల రాము, నలమాస సమ్మయ్య గౌడ్, దీకొండ శ్రీనివాస్, బచ్చలి లక్ష్మణ్, రాంపల్లి రవి, ఎద్దు కొమురెల్లి, కొమ్ము సోమన్న వీరమనేని రమేష్, ఎండీ పాషా, నాయకులు మాచర్ల సత్తయ్య, రామచంద్రు, సతీష్, జూకంటి వెంకన్న, రాజకుమార్, ఎస్.కె రాజబెల్లి, పవన్, అశోక్ మహేష్, సురేందర్, అఖిల్, పాండియా నాయక్, రంగయ్య, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *