కొడకండ్ల:
మైదాం చెరువు తండా గ్రామపంచాయతీ లోని బడి తండాకు చెందిన కాంగ్రెస్ ,బీజేపీ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో మంగళవారం బీ ఆర్ ఎస్ పార్టీలో చేరారు తండాకు చెందినజాటోత్ సతీష్, ధరావత్ అశోక్ విజయ్,సురేష్, సుమన్, అజయ్, చందులాల్, విజయ్ గణేష్, నితిన్ చంద్ర, సంతోష్, ప్రవీణ్, గణేష్ నాగేంద్రబాబు,వెంకన్న, అరవింద్ చంద్ర,లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను మరియు మా చిరకాల కోరికలైన గిరిజన తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా మరియు రిజర్వేషన్ ఆరు శాతం నుంచి 10% పెంచిన ఘనతను మరియు గిరిజన పంచాయితీ లో మంత్రిగారు చేస్తున్న అభివృద్ధి చూసి ఆకర్షితులై BRS పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈజిఎస్ రాష్ట్ర డైరెక్టర్ యాకయ్య, జిసిసి మాజీ చైర్మన్ అభిమన్ గాంధీ నాయక్, సర్పంచ్ మహేష్ నాయక్, ఉప సర్పంచ్ నరేష్ నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply