కొడకండ్ల:
మండల కేంద్రానికి చెందిన 2002-03 పదో తరగతి కి చెందిన బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మిత్రుడు తండ్రికి ఆర్థిక సహాయాన్ని మంగళవారం అందజేశారు. తమతో కలిసి చదువుకున్న అంబదాస్ తండ్రి ఎన్నం సత్తయ్య అనారోగ్యానికి గురికాగా తమ వంతుగా పోగుచేసిన రూ.20,100 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మిత్రుల ఆపద సమయాల్లో తమ వంతుగా అండగా ఉంటామని సంస్థ అధ్యక్షుడు పెద్దపూడి ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి చెరుకు సంధ్య, ఉపాధ్యక్షుడు గొడుగు శ్రీను, సహాయ కార్యదర్శి నరమెట్ట మమత, ఈసీ మెంబర్లు అరుణ్ గోపాల్, షేక్ అక్బర్ పాల్గొన్నారు.
Leave a Reply