దేవరుప్పుల ః ప్రజారోగ్య పరిరక్షణ కోసం అంగన్వాడీ కేంద్రాల తోడ్పాటు అభినందనీయమని ఎంపీపీ బస్వ సావిత్రి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో పోషణ మాసోత్సవాలు పురస్కరించుకొని పౌష్టికాహారంపై సదస్సు నిర్వహించి పలువురు గర్బీణీ స్త్రీలకు సీమంతాలు చేశారు. కౌమర దశ బాలికల నుంచి పుట్టిన శిశువు ఆరోగ్యం, విద్య అభ్యున్నతి కోసం పాటుపడుతున్న ఐసిడిఎస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ టి సురేష్కుమార్, సర్పంచ్ రమాదేవి, ఎంపీటీసీ రేణుక, ఎసిడిపిఓ విజయలక్ష్మీ, సూపర్వైజర్లు అన్వరున్నీషా, శ్రీదేవి, అంగన్వాడీ టీచర్లు సువర్ణ, సునిత, శోభ, భాగ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply