తొర్రూరు:
రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టాలని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ పూసాల శ్రీమాన్ అన్నారు.
మండలంలోని వెలికట్ట గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో శనివారం ‘బిజెపి ప్రవాస్ యోజన’ కార్యక్రమం నిర్వహించారు.
రూరల్ మండల అధ్యక్షుడు బచ్చు సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీమాన్ మాట్లాడారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని, రాష్ట్రంలో అసలైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని అన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చే కార్యకర్తలు అంకిత భావంతో పనిచేయాలని కోరారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.
పోలింగ్ బూత్ స్థాయి లో పార్టీ నిర్మాణం పై చర్చించారు.
ఈ సమావేశంలో అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ సుంకరనేని కోటేశ్వర్, మండలప్రధాన కార్యదర్శి కొండ యాకన్న, మండల ఉపాధ్యక్షులు పులుగుజ్జ సాయి, నాయకులు గుండా సురేష్, దేవరకొండ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply