కాంగ్రెస్ లో చేరిన తట్టేకుంట తండా బీఆర్ఎస్ కార్యకర్తలు

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కార్యకర్తలు
రాయపర్తి: మండలంలోని తట్టేకుంట తండాకు చెందిన సుమారు 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు బుధవారం పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హనుమండ్ల ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిని యశస్విని రెడ్డి ల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ముద్రబోయిన వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ మండల పార్టీ సీనియర్ నాయకులు జిలుగు రత్నాకర్ రెడ్డిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన అనంతరం వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకుల మోసపూరిత హామీలతో విసుగు చెంది కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు. తండాకు చెందిన బానోతు సోమ్లా, లావుడియా నరసింహ, భూక్య శంకర్, ఇస్లావత్ నవీన్, గణేష్, దేవోజీ, లచ్చిరాం, సుమన్, మైబు, ఈరమ్మ, లావుడియా మంగమ్మ తదితరులు కాంగ్రెస్ లో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *