రాయపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న సొసైటీ సీఈఓ
రాయపర్తి: శ్రమకోర్చి పండించిన పంటను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని రాయపర్తి ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం సీఈఓ సోమిరెడ్డి అన్నారు. మండలంలోని రాయపర్తి, గన్నారం, ఏకె తండా, సూర్యతండాలలో శుక్రవారం రాయపర్తి ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్ముకోవడం వల్ల ప్రయోజనం చేకూరుతుందన్నారు. దళరులకు విక్రయిస్తే నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. విధిగా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని కోరారు. ఈకార్యక్రమం లో వ్యవసాయ విస్తరణ అధికారం శిరీషా, సొసైటీ సిబ్బంది మల్లేష్, పలువురు రైతులు పాల్గొన్నారు.
Leave a Reply