–పాలకుర్తి ఎమ్మేల్యే బీజెపి అభ్యర్థి రాంమోహన్రెడ్డి
దేవరుప్పుల ః
డబుల్ ఇంజన్ సర్కారుతో సమగ్రాభివృద్ది సా«ధ్యమవుతుందని పాలకుర్తి ఎమ్మేల్యే బీజెపి అభ్యర్థి లేగ రాంమోహన్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని రామరాజుపల్లి, నీర్మాల మరియు సింగరాజుపల్లిలో గడపగడపకు ప్రచారం చేపట్టారు. మోడీ సర్కారు తెలంగాణకు విరివిగా నిదులు కేటాయిస్తే కెసీఆర్ పథకాల పేరు మార్చ తనవీగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. నియోజకవర్గంలో ఊరూరా జరిగిన సీసీ రోడ్లు, ఉపాధి కింద పలు అభివృద్ది పనులు, పల్లెప్రకృతి పనులను ఉదహరించారు. కార్యక్రమంలో బీజెపి జిల్లా అధికార ప్రతినిధి చింత సృజన్కుమార్, మండల అ«ధ్యక్షుడు బాగాల నవీన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply