అధికారాన్ని అడ్డు పెట్టుకుని దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం

  • ప్రొఫెసర్ వెంకట నారాయణ
    రాయపర్తి: అధికారాన్ని అడ్డు పెట్టుకుని తెలంగాణ ను తమ జాగిర్ గా మార్చుకుని కల్వకుంట్ల ప్రభుత్వం దోపిడి చేసిందని తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ అన్నారు. సోమవారం రాయపర్తి మండలం కేంద్రంలో విలేకర్లతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను వంచనకు గురి చేసిందన్నారు. విద్యా వ్యవస్థలను నాశనం చేసి పేదలకు విద్య దక్కకుండా చేశారన్నారు. ప్రభుత్వ భూములను లక్ష్యంగా పెట్టుకుని అవినీతి అధికారుల అండతో ధరణి దుర్మార్గ వ్యవస్థ మాటున పేద రైతుల భూములను సొంతం చేసుకున్నారన్నారు. రాష్టంలో ప్రజాస్వామ్యం లేకుండా చేశారన్నారు. ఉద్యమ కారులను గుర్తించకుండా నిరుద్యోగులను నిండా ముంచిదన్నారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *