-బొమ్మకల్లు కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు యాకయ్య గౌడ్
పెద్దవంగర:
ఈ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి యశస్విని రెడ్డి గెలుపును ఎవరు నిల్వదించలేరని బొమ్మకల్లు కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొడకంటి యాకయ్య గౌడ్ అన్నాడు. సోమవారం మండలంలోని బొమ్మకల్లు గ్రామంలో పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి గెలుపు కోరుతూ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడకంటి యాకయ్య గౌడ్ మాట్లాడుతూ.. ఓటమి భయంతో బీఆర్ఎస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఉచిత విద్యుత్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వయోవృద్ధులైన భార్యభర్తలకు ఆసరా , యువతుల కళ్యాణలక్ష్మీ రూ.లక్షతో పాటు తులం బంగారం అందిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కు ఓటేసి యశస్వినిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ధరావత్ శంకర్ నాయక్, పొడిశెట్టి రామ్మూర్తి, పొడిశెట్టి యాకయ్య, వెలికట్టే ఐలయ్య, దాసరి సంపత్, బీసు చిన్న సోమయ్య, చిన్న వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply