కొడకండ్ల: మండల కేంద్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ నసీరుద్దీన్, సీనియర్ నాయకుడు దళిత రత్న అందే చంద్రయ్యలు సోమవారం పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఝాన్సీ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామన్నారు.
Leave a Reply