- కేంద్ర బలగాల కవాతు
పెద్దవంగర:
ఈ నెల 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని సీఐ సత్యనారాయణ తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం మండలంలోని అవుతాపురం పోచంపల్లి గ్రామాల్లో కేంద్ర సాయుధ బలగాలు కవాతు నిర్వహించాయి.
ఈ సందర్భంగా స్థానిక ఎస్సై పిల్లల రాజుతో కలిసి సిఐ మాట్లాడుతూ…
ఎన్నికల్లో నేరాల నివారణకు, అందరూ శాంతియుతంగా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా భరోసా ఇచ్చేందుకు కేంద్ర బలగాల కవాతు నిర్వహించినట్లు తెలిపారు.
స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అండగా ఉంటారని అన్నారు. ప్రజల్లో విశ్వాసం కలిగించేందుకే పోలీసులు కవాతు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకావద్దని సూచించారు.
ఈ కవాతుల ఏఎస్ఐ కుమారస్వామి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Leave a Reply