తొర్రూరు:
పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి గెలుపుకు గౌడ కులస్తులు మద్దతు తెలిపారు.తొర్రూరు మండల,పట్టణ గౌడ కుల సంఘం ఆధ్వర్యంలో సభ్యులందరూ పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఝాన్సీ యశస్విని రెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ బుధవారం స్వచ్ఛందంగా నలభై కుటుంబాల సభ్యులందరూ మద్దతు తెలుపుతూ 12వ వార్డు ఇన్చార్జ్ జలగం రామ్మూర్తి గౌడ్ ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో స్థానిక గౌడ కుల సంఘం పెద్ద గౌడ్ రమేష్ గౌడ్, సారకల గౌడ్ బొమ్మగాని నరసయ్య,యాకయ్య, కుల సంఘం సభ్యులు చీకటి శంకరయ్య,బండి ప్పలయ్య,రావుల రాములు,జలగం ఐలయ్య, కొంపెల్లి భాషయ్య జలగం నారాయణ, వెంకన్న,రమేష్, చిన్న రామచంద్రయ్య, బండి శంకరయ్య,కమలాకర్,లింగన్న, వెంకట వెంకట సోములు సంపత్ ,బొమ్మగాని మహేష్ మనోజ్, సాయి, రాకేష్,నాగన్న, యాకయ్య రాజు,సుధాకర్, పెద్ద వెంకన్న లు ఉన్నారు.ఈ కార్యక్రమంలో తొర్రూరు మాజీ సర్పంచులు పెదగాని సోమయ్య, చాపల బాపురెడ్డి,నాయకులు మునుకుంట్ల నర్సయ్య,మెరుగు మల్లేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply