కొడకండ్ల: మండలంలోని గుమ్ముల బండ తండాలో బుధవారం కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ హయాంలోని గిరిజన సంక్షేమం చేకూరిందని కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్న వెంటనే పేద ప్రజల సంక్షేమం కోసం రూపొందించిన ఆరు గ్యారెంటీ స్కీములను అమలు చేయడం జరుగుతుందని కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నాయకులు గిరిజనులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గుగులో సీతారాం నాయక్ గూగుల్ యాకేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు
Leave a Reply