పాలకుర్తిలో ఖాళీ అవుతున్న కారు.. హస్తం పార్టీ జోరు

కొడకండ్ల :మండలం లోని నర్సింగాపురం గ్రామం కు చెందిన బీ ఆర్ ఎస్ మాజీ సర్పంచ్ వనస రామదాసు బీ ఆర్ ఎస్ మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు సోమయ్య మాజీ 4వ వార్డ్ మెంబర్ ముత్యం వెంకన్న , మాజీ వార్డ్ మెంబర్ గుర్రం లింగయ్య, బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు సుమారు 100 మందికి పైగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి , పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి సమక్షం లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకీ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ నుండి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.

రాబోయే ఎన్నికల్లో దయాకర్ రావు ఓటమి ఖాయమని, దయాకర్ రావుని ఓడించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలన్నారు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరు గ్యారెంటీగా అమలు చేయడంతో పాటు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తాం

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త బూత్ స్థాయి నుండి ఒక సైనికునీ లాగా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్ నాయకులు రమేష్ యాకాన్న రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *