దేవరుప్పుల ః
మండలంలోని మాధాపురం బీఆర్ఎస్కు చెందిన ఉప సర్పంచ్ శ్రీధర్తో పాటు మరో 15 మంది కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జీ ఝాన్సీరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో కౌడగాని రతన్, వర్రె సంపత్, చిలుకాని రవి, ననుబోతుల లింగస్వామి, కావటి రాములు, చిలికాని దయాకర్, శీల యాదగిరి, మడికొండ శ్రీను, మడికొండ యాకన్న, పారుపల్లి బిక్షపతి, గుర్రం పర్శరాములు, ఉన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీమంతోజు శ్రీనివాస్ చారీ., సీనియర్ నాయకులు కౌడగాని రాంచందర్, కొంగరి గిరి బాబు, ఏనుగుతల కొమురయ్య, గుర్రం అంజయ్య, గుర్రం సోమ కొండయ్య, సుధాకర్, సోమిరెడ్డి పాల్గొన్నారు.
Leave a Reply