హనుమాండ్ల రాజేందర్ ఝాన్సీ రెడ్డికి స్వాగతం తెలిపిన నాయకులు

పెద్దవంగర:
పోరాటాల పురిటిగడ్డ పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి యశస్విని రెడ్డి మామ హనుమండ్ల రాజేందర్ ఝాన్సీ రెడ్డి అమెరికా నుంచి నియోజకవర్గానికి విచ్చేస్తున్న సందర్భంగా వారికి కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు . పుష్పగుచ్చం అందజేసి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో
మండల పార్టీ ఉపాధ్యక్షుడు బొమ్మరబోయిన మహేందర్ యాదవ్, మండల ఐటీ సెల్ అధ్యక్షులు గిరగానికి క్రాంతి కుమార్ గౌడ్, మండల యూత్ కార్యదర్శి గిరగాని రఘు గౌడ్, గిరగాని కార్తీక్ గౌడ్, శవగామి తరుణ్ గౌడ్ గారు ఇతరులు పాల్గొన్నారు. అనంతరం క్రాంతి కుమార్ గౌడ్ మాట్లాడారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పాలకుర్తిలో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యశస్విని రెడ్డి గెలుపు కోసం శ్రమించి విజయాన్ని బహుమతిగా అందజేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *