–టీపీసీసీ సభ్యులు డాక్టర్‌ లక్ష్మీనారాయణనాయక్‌

దేవరుప్పుల ః తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను ఓడించకుంటే రాచరికపు పాలన పునరావృతం అవుతుందని టీïపిసిసీ సభ్యులు, డాక్టర్స్‌ సెల్‌ విభాగం జనగామ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ లాకాత్‌ లక్ష్మీనారాయణనాయక్‌ అన్నారు. శుక్రవారం పాలకుర్తి కాంగ్రెస్‌ ఎమ్మేల్యే అభ్యర్థి మామిడాల యశస్వినిరెడ్డి గెలుపు కోసం తొర్రూరులో తలపెట్టిన విజయభేరి సభకు ప్రియాంకగాంధీ వస్తున్నందున హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పిలుపు మేరకు మండలం నుంచి కాంగ్రెస్‌ శ్రేణులు భారీగానే తరిలివెళ్లారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతి,ఆత్మగౌరవం కోసం రిజర్వేషన్‌ ,నిలువనీడ లేని పేదలకు ఇళ్ల స్థలాలు, పక్క భవననిర్మాణాలు ఇచ్చిన ఘనత ఇందిరమ్మ పాలనకు దక్కుతుందన్నారు. కార్యక్రమాల్లో ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు నల్ల శ్రీరాములు, మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కృష్ణమూర్తి, పీఎసిఎస్‌ మాజీ చైర్మన్‌ కాసారపు ధర్మారెడ్డి, మాజీ వైస్‌ఎంపీపీ శ్రీనివాసాచారీ, ఓడపల్లి రవీందర్, రెడ్డిరాజుల రమేష్, తోటకూరి పాండుకృష్ణ, రమేష్, నల్ల సత్యనారాయణ, వంగ దశరథ, బోనగిరి నర్సింహ్మలు, యాకస్వామి, గణేష్, సజ్జన్, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *