మీ కష్టాల్లో పాలు పంచుకుంటూ సేవ చేస్తా

  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
    పాలకుర్తి(రాయపర్తి): నిత్యం అందుబాటులో ఉంటూ మీ కష్టాల్లో పాలు పంచుకుంటూ సేవ చేస్తానని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మండలంలోని తిర్మలాయపల్లి, రాయపర్తి, గన్నారం, కొండూరు, బురహన్ పల్లి, కాట్రపల్లి, కిష్టాపురం, మొరిపిరాల, మైబునగర్ గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు నీళ్లు లేక పంట పొలాలు బీడు భూములుగా ఉండేవని ప్రస్తుతం కోనసీమను తలపించే విధంగా మారాయి అన్నారు. కాంగ్రెస్ పార్టీ వీళ్ళ తరబడి పాలించిన సమయంలో చేయలేని అభివృద్ధి బీఆర్ఎస్ చేసిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. తనను ఆరుసార్లు గెలిపించిన ప్రజల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానన్నారు. వ్యక్తిగతంగా సహాయం కాకపోవచ్చు ఏమో కానీ ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే వ్యక్తిగతంగా వారి ఉన్నతికి కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలు నమ్మితే ఐదేళ్ల అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. జరగనున్న ఎన్నికల్లో తన గెలుపు ఖాయం అన్నారు. మీ ఆశీర్వాదంతో తాను అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషా, బీఆర్ఎస్ మండల ఇన్చార్జి గుడిపూడి గోపాలరావు, ఎంపీపీ అనిమిరెడ్డి, జడ్పీటీసీ కుమార్, నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి, మునావత్ నరసింహ నాయక్, ఆకుల సురేందర్ రావు, చందు రాము, రామచందర్, సుధాకర్, వెంకటేశ్వర్లు, యాకయ్య, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *