కెసీఆర్‌ హాయాంలోనే దళిత కాలనీలు అభివృద్ది

–బీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి రవి
దేవరుప్పుల ః సీఎం కెసీఆర్‌ సారధ్యంలో దళిత కాలనీలు అభివృద్ది చెందాయని బీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి చింత రవి అన్నారు. సోమవారం.మండలంలోని కామారెడ్డి గూడెం గ్రామంలో బీఆర్‌ఎస్‌ దళిత కుటుంబాలతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలకు మేలు చేసేలా సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని,కాంగ్రెస్,బీజేపీ మాయమాటలు విని అభివద్ధిని దూరం చేసుకోవద్దని సూచించారు. కాంగ్రెస్‌ హయాంలో అభివద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు.మంత్రి ఎర్రబెల్లి సారధ్యంలో అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అభివద్ధి చెందాయని అన్నారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌ మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మాచర్ల బాబు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి చింత రవి, మండల నాయకులు జోగు సోమనర్సయ్య,జెర్రిపోతుల సాయిలు, మేడ సోమనర్సయ్య, నియోజకవర్గం సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ గుండె రమేష్, గ్రామ పార్టీ యువత అధ్యక్షుడు గుండె మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *