–తెలంగాణ ఉద్యమకారుల జెఎసీ రాష్ట్ర నాయకుడు కొమురయ్య
దేవరుప్పుల ః
తెలంగాణ ఉద్యమకారులను బీజెపి, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకవర్గాలు తీరని మోసం చేశాయని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ఉద్యమ నాయకుడు తెలంగాణ కొమురయ్య ఆరోపించారు. సోమవారం మండలంలోని కడవెండిలో దొడ్డి కొమురయ్య స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించి కర పత్రం ఆవిష్కరించారు. దొడ్డి కొమురయ్య అమరత్వం ఆశయాలను అమలు చేసేందుకు గద్దర్ అన్న పోరాటం , కొండా లక్ష్మణ్ బాపూజీ, గూడ అంజన్న చాకలి ఐలమ్మ పోరాటం వెలకకట్టలేమన్నారు. సీఎం కెసీఆర్ ఉద్యమంలో మేథావులు,విద్యార్థి, ప్రజాసంఘాలను వాడుకొని అధికారంలోకి రాగానే తెలంగాణ ద్రోహులను అక్కున చేర్చుకోవడంతో పురర్మిర్మాణం పక్కదారి పట్టిందన్నారు. రాష్ట్రం వచ్చి పదేళ్లు అయినా ఉద్యమకారులను గుర్తించలేదనీ, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఉద్యమకారుల తోడ్పాటు పట్ల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపంచుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రుణం తీర్చుకునేలా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యశస్విన్ రెడ్డి గెలిపించాలని అన్నారు. కార్యక్రమంలో చంద్రన్న, యాదగిరి, సోమన్న, రౌతు శీను, మేడిగే సతీష్, పంజాల యాకేందర్ గౌడ్, యాకన్న మిరియాల అశోక్ ,రాజు, నర్సింగం ,తుడు వెంకటేష్ , రంజిత్, సంజీవ్, రాజయ్య ,ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు
Leave a Reply