మరో రెండ్రోజుల్లో ఏపీలో వర్షాలు : తుఫాన్‌గా మారే అవకాశం

అమరావతి : మరో రెండ్రోజుల్లో ఏపీలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దక్షిణ అండమాన్ మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. పశ్చిమ – వాయువ్య దిశగా కదులుతూ రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శనివారం నాటికి నైరుతి & ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో శనివారం నుంచి వర్షాలు పడనున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటి నుంచే రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *