ఖమ్మం రూరల్ , (పాలేరు ఎక్స్ప్రెస్ న్యూస్): తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం రూరల్ మండలంలో బుధవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ఎదులాపురం గ్రామంలోని సూర్యనగర్ లో జరిగిన శ్రీ ముత్యాలమ్మతల్లి, పోతురాజు స్వామి వార్ల ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ప్రజలందరినీ సల్లంగ చూడు తల్లి అని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహకులు పొంగులేటిని ఘనంగా సత్కరించారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, పాలేరు నియోజకవర్గ నాయకులు చావా శివరామకృష్ణ, కల్లెం వెంకట రెడ్డి, మద్ది కిశోర్ రెడ్డి, అజ్మీరా అశోక్ నాయక్, సుదగాని ఉపేందర్, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మెండె వెంకటేష్ యాదవ్, కర్లపూడి భద్రకాళి, గునిగంటి రమేష్, మహేష్, బాణోతు హరి, సురేష్ తదితరులు ఉన్నారు.
Leave a Reply