విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలితొర్రూరు:విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఎస్సై జగదీష్ అన్నారు.

శనివారం డివిజన్ కేంద్రంలోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో బాలికల భద్రత – సైబర్ నేరాలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ప్రిన్సిపాల్ జయశ్రీ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎస్సై మాట్లాడుతూ….
చట్టాలపై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచు కోవాలని పేర్కొన్నారు.
అపరిచిత వ్యక్తులు, పరిచయస్తులు, సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తే నిర్భయంగా డయల్‌ 100కు ఫోన్‌ చేసి సహాయం పొందాల న్నారు.
మానవ అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దాడులను నివారించాలని తెలిపారు. మహిళలు, బాలికలకు రక్షణ కల్పించడమే పోలీస్‌ శాఖ లక్ష్యమన్నారు.
18 ఏళ్ల లోపు బాల బాలికలకు చట్టం రక్షణ కల్పిస్తుందన్నారు. 18 ఏళ్ల లోపు బాలికలకు వివాహం చేస్తే చట్టరీత్యా నేరమని తెలిపారు. చదువుకునే వయసులో సోషల్ మీడియా, సెల్ ఫోనుకు దూరంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, స్టేటస్ లో పెట్టుకోవద్దని, వాటిని సైబర్ నేరగాళ్లు మార్ఫింగ్ చేసి వేధింపులకు గురి చేసే అవకాశం ఉంటుందన్నారు. మార్కులు ప్రతిభకు కొలమానం కాదని, నైపుణ్యాలు పెంపొందించుకోవడం అవసరమన్నారు.

ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు సాయికిరణ్ హైమ భజ్జాలాల్, రామచంద్రు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *