సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి–పల్లె దవఖాన డాక్టర్‌ మైదం లక్ష్మీ

దేవరుప్పుల ః
సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పల్లె దవఖాన డాక్టర్‌ మైదం శ్రీలక్ష్మీ అన్నారు. శనివారం మండలంలోని దర్మగడ్డ తండ గ్రామంలో గ్రామ పంచాయితీ ఆవరణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పూజ ఆదేశానుసారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో నీరు నిల్వ ఉంటుందని దాంట్లో దోమలు వృద్ది చెందుతాయనీ, విధిగా వ్యక్తిగత, పరిసరాల పరిశభ్రత పాటిస్తూ దోమ కాటుతో డెంగ్యూ, మలేరియా, మెదడు వాపు వ్యాధులు నివారణకు పాటుపడాలని సూచించారు,కార్యక్రమంలో సర్పంచ్‌ గుగులోతు సునీత ఆంజనేయులు, సూపర్‌ వైజర్‌ భాగ్యశ్రీ, ఏఎన్‌ఏమ్‌లు జ్యోతి, సృజన, ఆశావర్కర్లు ఎలెంద్ర,విజయ, సరిత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *