దేశ ఐక్యతకు పాటుపడిన పటేల్

తొర్రూరు:
దేశ ఐక్యతకు పాటుపడిన స్ఫూర్తి ప్రదాత
సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రెబ్బ శ్రీనివాసరావు అన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సమైక్యత దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దానిలో భాగంగా క్విజ్, వక్తృత్వ, పోస్టర్ మేకింగ్ పోటీలు నిర్వహించారు.
జాతీయ సమైక్యతకు పాటుపడతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.

సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ….
ఉక్కు సంకల్పంతో స్వతంత్ర భారతాన్ని ఐక్యంగా ఉంచిన మహనీయులు పటేల్ అని కొనియాడారు.
స్వాతంత్య్రం అనంతరం దేశంలోని అనేక సంస్థాలను విలీనం చేశా రన్నారు. తొలి ఉప ప్రధానిగా, హోంమంత్రిగా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బరిగెల నారాయణ,
అధ్యాపకులు రమేష్ కుమారస్వామి, సువర్ణ , అన్నపూర్ణ, నర్సయ్య , ఉప్పలయ్య చారి, శివ మల్లయ్య, అనిత ,రాజేష్, అలీ, వాలంటీర్లు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *