తొర్రూరు:
శాసనసభ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం పై బిజెపి జెండా ఎగరవేస్తామని బిజెపి పార్టీ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి లేగా రామ్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం బీజేపీ అభ్యర్థి లేగా రాంమోహన్ రెడ్డి గెలుపు కోరుతూ పట్టణంలో 7,8,9 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈసందర్బంగా బీజేపీ అభ్యర్థి లేగా రాంమోహన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసిని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చిన తరువాత రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయిందని తెలిపారు. పాలకుర్తి ప్రజలు విచక్షణ కలిగిన ప్రజలని, నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.
బీజేపి తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిజెపి పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసాల శ్రీమాన్,జిల్లా కార్యదర్శి పరుపాటి రాం మోహన్ రెడ్డి,సుంకరనేని కోటేశ్వర్,మంగళపళ్ళి యాకయ్య,బొమ్మనబోయిన కుమార్,పైండ్ల రాజేష్,శేఖర్, జలగం రవి, విజయ్ కుమార్,కాగు నవీన్,గంధం రాజు,చలపతి,నూకల నవీన్, జగదీష్, సంతోష్, శివ, తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply