అండగా నిలవండి.. మార్పు చూపిస్తాం…

  • కాంగ్రెస్ నాయకురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి 
  • వడ్డెకొత్తపల్లి కాంగ్రెస్ లోకి భారీగా వలసలు 

పెద్దవంగర:
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మామిండ్ల యశస్విని రెడ్డికి అండగా నిలవండి, భవిష్యత్తుకు భరోసా, మార్పు చూపిస్తామని కాంగ్రెస్ నాయకురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని వడ్డెకొత్తపల్లి గ్రామానికి చెందిన 300 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు మాజీ జెడ్పీ ఫోర్ లీడర్, సర్పంచ్ నెమరుగొమ్ముల ప్రవీణ్ రావు, శైల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాలకుర్తి రాజకీయాల్లోకి మార్పు రాబోతుందని జోస్యం చెప్పారు. నూతన రాజకీయాలకు నియోజకవర్గం నాంది పలకనుందని స్పష్టం చేశారు. ఆస్తులు, అంతస్తులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని, ప్రజా శ్రేయస్సు, సంక్షేమం కోసం వచ్చినట్లు పునరుద్ఘాటించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అడుగడుగునా అడ్డుకున్నారని, చివరికి న్యాయమే గెలుస్తుందని చెప్పారు. పాలకుర్తి లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని, మరో 10 రోజులు కార్యకర్తలు ఇదే జోష్ తో, రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు. అటు పాలకుర్తి తో పాటుగా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందన్నారు. యశస్విని రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు. పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేసే కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా కల్పించారు. పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీ పథకాలను వెంటనే అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ సభ్యులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *