అవినీతి, అరాచక ప్రభుత్వాలను సాగనంపాలి

  • విదేశాల్లో స్థిరపడిన వ్యాపారస్తులకు రైతు బంధు?
  • ఓటు తోనే పాలకులకు గుణపాఠం చెప్పాలి
  • జాగో తెలంగాణ వేదిక కన్వీనర్ మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి

పెద్దవంగర:
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ అవినీతి, ఆరాచక ప్రభుత్వాలను ఇంటికి సాగనంపాలని జాగో తెలంగాణ వేదిక కన్వీనర్, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు. తెలంగాణ ఓటర్ల చైతన్య ప్రచార యాత్రలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలో ప్రజలకు ఓటు విలువ పై అవగాహన సదస్సు కల్పించారు. రాష్ట్రంలో ఉన్న వనరులను ప్రజల అభివృద్ధి కోసం పూర్తిగా వినియోగించడం లో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్ర సంక్షేమాన్ని గాలికి వదిలేసి, కేసీఆర్ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ ఆశలను ఆకాంక్షలను తీర్చుకోవటం కోసం గత పది సంవత్సరాల నుండి వేలాది రూపాయలతో శిక్షణ తీసుకుంటూ, నిరుద్యోగులు ముసలి వాళ్ళ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 22 లక్షల మందిగా ఉన్న కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వకుండా విదేశాలలో స్థిరపడ్డ వ్యాపారస్తులకు, సినిమా హీరో హీరోయిన్లకు 18 లక్షల కోట్లు రైతుబంధు రూపేనా సహాయం చేయటం ఏమిటని ప్రశ్నించారు? మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి అందరిపై అప్పుల భారాన్ని మోపుతూ అవినీతి పరిపాలన సాగిస్తున్నాడని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి 15 లక్షల రూపాయల నల్లధనాన్ని అకౌంట్లో వేస్తానంటే ఐదు కోట్ల మంది ఖాతాలు తెరిచే తెరిచారని ఎవరికీ రూపాయి వేయలేదని విమర్శించారు. కలిసున్న ప్రజల మధ్య మతాల మధ్య, కులాల మధ్య కొట్లాటలు పెట్టించి ఆ మంటలలో చలిగాసుకుంటున్న మోడీ సర్కారు విధానాలపై పోరాడటం అంటే బీజేపీని ఓడించటమే అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రొఫెసర్స్ వినాయక రెడ్డి, పద్మజా దళిత శక్తి రాష్ట్ర కన్వీనర్ శంకర్, రాష్ట్ర అధ్యక్షులు స్వరూప,ముంజంపల్లి వీరన్న,కల్పన, గౌస్ సంధ్య,సౌజన్య,రాములు,నిర్మల తదితరులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *