కాంగ్రెస్ లో చేరిన రైతు బంధు జిల్లా సమితి సభ్యులు

మందాడి సుదర్శన్ రెడ్డి
రాయపర్తి: మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన రైతు బంధు జిల్లా సమన్వయ సమితి సభ్యులు మాందాడి సుదర్శన్ రెడ్డి ఆదివారం కాంగ్రెస్ లో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిన అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. ఆయనతో పాటు గౌడ సంఘం సర్పంచ్ నాల్లం సమ్మయ్య, దొమ్మటి శ్రీశైలం, నాల్లం రవి, మాద సరిత, రమేష్, సుల్తాన్, ఉపేందర్, రమేష్, యాకనారాయణ, తదితరులు కాంగ్రెస్ లో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *