ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా సౌభాగ్యం:

మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ ప్రవీణ్ కుమార్
కొడకండ్ల: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తో ఇంటింటా సౌభాగ్యం చేకూరుతుందని మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ నెమరుగమ్ముల ప్రవీణ్ కుమార్ గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ మాట ఇస్తే మడమ తిప్పకుండా అమలు చేసే నైజం కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుందని, గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో పేదల సంక్షేమం కరువైందని, నిరుపేదల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా ఆరు గ్యారెంటీ పథకాలను రూపొందించడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరుగుతుందన్నారు. చైతన్యానికి మారుపేరైన పాలకుర్తి ప్రజలు ఈ ఎన్నికల్లో తమ భవిష్యత్తును నిర్దేశించుకుని ప్రలోభాలకు గురికాకుండా ఈనెల 30 న జరిగే అసెంబ్లీ ఎన్ని కల్లో కాంగ్రెస్ పార్టీ పాలకుర్తినియోజకవర్గ అభ్యర్థి హనుమండ్ల ఝాన్సీ యశస్విని రెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రవీందర్. జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి అబ్దుల్లా.
మాజీ ఉపసర్పంచ్ వనం మోహన్. ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ధర్మారపు బిక్షపతి.మహిళా
అధ్యక్షురాలు. శ్రీ వర్ణ. యూత్ ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ. పృద్వి. కిసాన్ సెల్ అధ్యక్షులు జగన్ రెడ్డి. ఎఫ్సిఎస్ డైరెక్టర్ వీరదాసు శ్రీనివాస్.శివమ్మా. ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ . అధ్యక్షులు హరగోపా ల్. దేశ గాని కుమార్ అశోకు కనకయ్య ఉప్పలయ్య వెంకన్న దేవేందర్ .పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *