హరిష్‌రావు రోడ్‌షోకు భారీగా తరిలిన గులాబీ శ్రేణులు

దేవరుప్పుల ః
కెసీఆర్‌ సార«ధ్యంలో పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి దయాకర్‌రావు ఆధ్వర్యంలో ఇంటింటా ్రçపభుత్వ సంక్షేమ పథకాలు అందని ఇల్లు ఉండదని బీఆర్‌ఎస్‌ మండల సమన్వయకర్తలు పల్ల సుందర్‌రామిరెడ్డి అన్నారు. శనివారం పాలకుర్తిలో ఎమ్మేల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు గెలుపు కోసం తలపెట్టిన హరీష్‌రావు రోడ్‌షో కోసం మండలంలోని ఆయ గ్రామాలతోపాటు నీర్మాలలో గులాబీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్బంగా ఇలాంటి ఇంటింటా పథకాలు అందించే సీఎం కెసీఆర్‌కు కానుకగా ,మంత్రి దయన్నను అత్యధిక మెజారీటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కొత్త జలంధర్‌రెడ్డి, ఎన్నం చంద్రమౌలి, ఎడమ నర్సిరెడ్డి,మేడ వెంకటేశ్వర్లు, సంజీవరెడ్డి, మల్లారెడ్డి,కాడబోయిన యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *