కొడకండ్ల: పాలకుర్తి నియోజకవర్గ బి ఆర్ ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సంబంధించిన ప్రచార వాహనం పై నుండి పడి బాలిక మృతి చెందిన సంఘటన కొడకండ్ల మండలం నీలిబండ తండా లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం దయాకర్ రావుకు సంబంధించిన ప్రచార వాహనం శనివారం సాయంత్రం తండాకు రాగా నీలి బండ తండాకు చెందిన గుగులోతు అంజలి తో పాటు కొంతమంది పిల్లలు వాహనం ఎక్కారు. వాహనం తిరుగుతూ ప్రచారం చేస్తున్న క్రమంలో అంజలి వాహనం పై నుండి పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో గాయపడిన అంజలి తిరుమలగిరి ఆసుపత్రికి తరలించి అక్కడ నుండి సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కామినేని ఆసుపత్రికి తరలించగా మృతి చెందింది. తండాకు చెందిన గుగులోత్ దేవేందర్ లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమార్తె అయిన అంజలి తండాలోని ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతుంది. ఊహించని రీతిలో వాహనం పై నుండి పడి అంజలి మృతి చెందడం పట్ల తండాలో విషాదం నెలకొంది.
Leave a Reply