రెడ్ ఫ్లాగ్ అభ్యర్థికే ఎర్రజెండా ఓట్లు.

పోరాట యోధురాలు ఐలమ్మ మనుమడు చిట్యాల.రామచంద్రం..
పాలకుర్తి:
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ(చాకలి ఐలమ్మ) మనుమడు చిట్యాల.రామచంద్రం ని రెడ్ ఫ్లాగ్ ఎన్నికల ప్రచార బృందం కలిసింది. కవి, పోతన సాహిత్య కళావేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడు, నిరంతర ప్రజా సేవకులు బుజేందర్.మాన్యపుకే ఎర్రజెండా ఓట్లను రామచందర్ పిలుపునిచ్చారు. పాలకుర్తి గ్రామానికి 25 సంవత్సరాల సర్పంచ్ గా పనిచేసిన అభివృద్ధే నేటి అభివృద్ధని వెల్లడించారు. బిఆర్ఎస్ పాలనలో ప్రజలను దోపిడీ చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. బిఆర్ఎస్ పాలనలో పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమన్నారు. ప్రజల సంపద, సహజం సంపద దోపిడీకి గురైందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎర్రజెండా ముద్దుబిడ్డ, కవి, సాహిత్యకారుడు బుజేందర్ మాన్యపు ఎన్నికల గుర్తు రోడ్ రోలర్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసే గెలిపించాలని పిలుపునిచ్చారు. పాలకుర్తి నియోజకవర్గంలో తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట యోధుల వారసత్వాన్ని నిలబెట్టాలని నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ప్రచారం విస్నూరు దేశాయ్ ముఖ్ గడిని తాకింది. కడివెండిలోని అమరులు దొడ్డి కొమురయ్య, శ్యాం, సంతోష్ రెడ్డి, ఆదిరెడ్డి, దొంతి అయోధ్య, శ్రీనివాస్ అమరుల స్థూపాలను సందర్శించి నివాళులర్పించారు. అమరుల వారసత్వాన్ని కొనసాగిస్తామని ప్రచారకులు ప్రతిజ్ఞ చేశారు.
అమరులకు నివాళులర్పించిన వారిలో రెడ్ ఫ్లాగ్ కేంద్ర కమిటీ సభ్యులు మరీదు ప్రసాద్ బాబు, ప్రతిఘటన జాతీయ కార్యదర్శి షేక్సావలి, రెడ్ ఫ్లాగ్ రాష్ట్ర కమిటీ సభ్యులు సుదమల్ల.భా‌స్కర్, నియోజకవర్గ ప్రచారం కార్యదర్శి తూర్పాటి.సారయ్య, సభ్యులు తూర్పాటి.వెంకటేష్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *