–బీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాచర్ల బాబు
దేవరుప్పుల ః
సీఎం కెసీఆర్ పాలనలో మంత్రి దయన్న చేసిన అభివృద్దితో పల్లెలు సుభీక్షంగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎస్సీ సెల్మండల అధ్యక్షులు మాచర్ల బాబు అన్నారు. ఆదివారం చిన్నమడూరులో దళితకాలనీలో ఎర్రబెల్లి దయాకర్ రావు గెలుపు కోసం విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలకు మేలు చేసేలా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు చరిత్రాత్మకమన్నారు. కాంగ్రెస్, బీజేపీ మాయమాటలు విని దళితులు మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ డైరెక్టర్ జోగు సోమనర్సయ్య, సీనియర్ నాయకులు జేరిపోతుల సాయిలు, మాజీ సర్పంచ్ మేడ సోమనర్సయ్య, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చింత రవి తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply