భారత చైతన్య యువజన పార్టీతో యువతకు న్యాయం

రాయపర్తి లో ప్రచారం చేస్తున్న ఏలిశాల రాజేష్
రాయపర్తి: భారత చైతన్య పార్టీతో యువతకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలిశాల రాజేష్ అన్నారు. రాయపర్తి మండల కేంద్రంలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే, రైతును రాజును చేయాలంటే భారత చైతన్య యువజన పార్టీకి ఓటు వేయాలని కోరారు. వీళ్ల తరబడి పాలించిన ఏ పార్టీ నాయకులు అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. తనను గెలిపిస్తే అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో భారత చైతన్య యువజన పార్టీ వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులు బచ్చలి స్వామి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *